డాల్ఫిన్లను పట్టుకున్నందుకు ముగ్గురికి జరిమానా విధించిన బహ్రెయిన్
- May 04, 2022
బహ్రెయిన్: డాల్ఫిన్లను పట్టుకున్నందుకు బహ్రెయిన్ ముగ్గురికి జరిమానా విధించింది. దేశంలోని ప్రాదేశిక జలాల్లో అక్రమంగా డాల్ఫిన్లను పట్టుకున్నందుకు దోషులుగా తేలిన తర్వాత బహ్రెయిన్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి BD1,000 చొప్పున జరిమానా విధించింది. ఈ తీర్పును మేజర్ క్రిమినల్ కోర్ట్ ఆమోదించింది. అలాగే ఫిషింగ్లో ఉపయోగించిన పడవను జప్తు చేయాలని ఆదేశించింది. పట్టుబడిన డాల్ఫిన్లను రక్షించడానికి వీలుగా వాటి సహజ ఆవాసాలకు తరలించాలని కొర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రాదేశిక జలాల్లో డాల్ఫిన్లను పట్టుకోవడం బహ్రెయిన్ లో నిషేధం. పర్యావరణం, సహజ సంపదను పరిరక్షించడం అనేది బహ్రెయిన్ రాజ్యాంగంలో ఓ భాగంగా ఉంది.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







