డాల్ఫిన్లను పట్టుకున్నందుకు ముగ్గురికి జరిమానా విధించిన బహ్రెయిన్
- May 04, 2022
బహ్రెయిన్: డాల్ఫిన్లను పట్టుకున్నందుకు బహ్రెయిన్ ముగ్గురికి జరిమానా విధించింది. దేశంలోని ప్రాదేశిక జలాల్లో అక్రమంగా డాల్ఫిన్లను పట్టుకున్నందుకు దోషులుగా తేలిన తర్వాత బహ్రెయిన్ కోర్టు ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి BD1,000 చొప్పున జరిమానా విధించింది. ఈ తీర్పును మేజర్ క్రిమినల్ కోర్ట్ ఆమోదించింది. అలాగే ఫిషింగ్లో ఉపయోగించిన పడవను జప్తు చేయాలని ఆదేశించింది. పట్టుబడిన డాల్ఫిన్లను రక్షించడానికి వీలుగా వాటి సహజ ఆవాసాలకు తరలించాలని కొర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రాదేశిక జలాల్లో డాల్ఫిన్లను పట్టుకోవడం బహ్రెయిన్ లో నిషేధం. పర్యావరణం, సహజ సంపదను పరిరక్షించడం అనేది బహ్రెయిన్ రాజ్యాంగంలో ఓ భాగంగా ఉంది.
తాజా వార్తలు
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా







