రోడ్ సేఫ్టీ వీక్: పోస్టర్లతో బహుమతులు గెలుచుకునే అవకాశం
- May 04, 2022కువైట్: మే 15 నుంచి 22 వరకు జరిగే రోడ్డు భద్రతా వారోత్సవం నేపథ్యంలో పోస్టర్ తయారీ పోటీల్ని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. కువైట్లోని ఇండియన్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు. ఇండియన్స్ ఇన్ కువైట్ డాట్ కామ్ అలాగే అల్ మైలెమ్ గ్రూప్ ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. పోటీలో విజేతలుగా నిలిచినవారికి 115 కువైటీ దినార్ల విలువైన బహుమతులు అందజేయడం జరుగుతుంది. మొదటి బహుమతి విజేతకు 50 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ లభిస్తుంది. రెండో బహుమతి విజేతకు 40 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ అందిస్తారు. మూడో బహుమతి విజేతకు 25 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడం జరుగుతుంది.అల్ మైలెమ్ గ్రూప్ ఈ బహుమతుల్ని అందించనుంది. రోడ్డు భద్రతపై పిల్లల్లో అవగాహన కల్పించడం ఈ పోటీల ఉద్దేశ్యం. మే 10లోపు ఫొటోలను పంపించాల్సి వుంటుంది. 15 మే నుంచి సోషల్ మీడియాలో ఎంపిక చేసిన పోస్టర్లు పోస్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..