రోడ్ సేఫ్టీ వీక్: పోస్టర్లతో బహుమతులు గెలుచుకునే అవకాశం
- May 04, 2022
కువైట్: మే 15 నుంచి 22 వరకు జరిగే రోడ్డు భద్రతా వారోత్సవం నేపథ్యంలో పోస్టర్ తయారీ పోటీల్ని విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నారు. 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. కువైట్లోని ఇండియన్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలకు అర్హులు. ఇండియన్స్ ఇన్ కువైట్ డాట్ కామ్ అలాగే అల్ మైలెమ్ గ్రూప్ ఈ పోటీలను నిర్వహిస్తున్నాయి. పోటీలో విజేతలుగా నిలిచినవారికి 115 కువైటీ దినార్ల విలువైన బహుమతులు అందజేయడం జరుగుతుంది. మొదటి బహుమతి విజేతకు 50 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ లభిస్తుంది. రెండో బహుమతి విజేతకు 40 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ అందిస్తారు. మూడో బహుమతి విజేతకు 25 కువైటీ దినార్ల వోచర్, గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వడం జరుగుతుంది.అల్ మైలెమ్ గ్రూప్ ఈ బహుమతుల్ని అందించనుంది. రోడ్డు భద్రతపై పిల్లల్లో అవగాహన కల్పించడం ఈ పోటీల ఉద్దేశ్యం. మే 10లోపు ఫొటోలను పంపించాల్సి వుంటుంది. 15 మే నుంచి సోషల్ మీడియాలో ఎంపిక చేసిన పోస్టర్లు పోస్ట్ చేస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







