ఆహార భద్రతలో స్వయం సమృద్ధి: బహ్రెయిన్
- May 05, 2022
బహ్రెయిన్: వ్యవసాయ, జంతు, చేపల ఉత్పత్తులలో స్వయం సమృద్ధిని సాధించేందుకు బహ్రెయిన్ కట్టుబడి ఉందని పనులు, మున్సిపాలిటీల వ్యవహారాలు, పట్టణ ప్రణాళిక మంత్రి, ఇంజినీర్ ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్ తెలిపారు. జనరల్ పౌల్ట్రీ కంపెనీని ఆయన సందర్శించారు. అనంతరం ఖలాఫ్ మాట్లాడుతూ.. ఆహార భద్రతలో స్వయం సమృద్ధిని సాధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పౌల్ట్రీ కంపెనీ సందర్శన సందర్భంగా గుడ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని, కంపెనీ విస్తరణ ప్రాజెక్ట్ ను ఖలాఫ్ సమీక్షించారు. 2020లో 83 మిలియన్ల ఉన్న గుడ్ల ఉత్పత్తిని ఈ సంవత్సరం 120 మిలియన్లకు పెంచడానికి విస్తరణ ప్రాజెక్ట్ దోహదపడుతుందని ఎస్సామ్ బిన్ అబ్దుల్లా ఖలాఫ్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..







