షార్జా: సముద్రంలో మునిగి భారతీయ వ్యక్తి మృతి!
- May 05, 2022
షార్జా: షార్జాలో రంజాన్ పండుగ పూట ఓ భారతీయ కుటుంబంలో విషాదం అలుముకుంది.అక్కడి హమ్రియా సముద్రంలో సరదాగా ఈతకు వెళ్లిన 24 ఏళ్ల భారత యువకుడు నీట మునిగి చనిపోయాడు.మృతుడిని కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లాలోని గురువాయూర్కు చెందిన ముహమ్మద్ ఎమిల్గా గుర్తించారు.అతడు ఫుజైరాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు.ఈద్ వేడుకల్లో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సముద్ర తీరానికి వెళ్లిన ఎమిల్.. సరదాగా ఈత కొడుతున్న సమయంలో లోపలికి కొట్టుకుపోయాడు. కొద్దిసేపటి తర్వాత అతడి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న షార్జా పోలీసులు ఎమిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం మృతదేహాన్ని మార్చురీలో ఉంచామని, లాంఛనాలు పూర్తయిన తర్వాత స్వగ్రామానికి తీసుకువస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







