విశాఖ: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
- May 05, 2022
విశాఖపట్నం: విశాఖ రుషికొండ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రుషికొండ భూములను పరిశీలించడానికి వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆపేశారు.హైవేపైనే బాబు కాన్వాయ్ను నిలిపివేశారు. బాబు రుషికొండవైపు రాకుండా ఎండాడ దగ్గరే ఆపేసి భీమిలివైపు మళ్లించారు.పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు రుషికొండ భూములను పరిశీలించాలని భావించారు.
అంతకుముందు సీఎం జగన్పై చంద్రబాబు మండిపడ్డారు.ఏపీని నెంబర్వన్గా తీర్చిదిద్దాలని టీడీపీ ప్రయత్నిస్తే.. జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.ప్రస్తుతం జగన్ జే బ్రాండ్, గంజాయి, డ్రగ్స్కు ఏపీని కేరాఫ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు.
దాదాపు 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు ఎవరు కట్టాలని ప్రశ్నించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులు వేశారని పేర్కొన్నారు. జగన్ది ఐరన్లెగ్ అన్న చంద్రబాబు..అతను ఉన్నంతవరకూ ఏ పరిశ్రమా రాదని కామెంట్ చేశారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!







