విశాఖ: చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
- May 05, 2022
విశాఖపట్నం: విశాఖ రుషికొండ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.రుషికొండ భూములను పరిశీలించడానికి వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ ఆపేశారు.హైవేపైనే బాబు కాన్వాయ్ను నిలిపివేశారు. బాబు రుషికొండవైపు రాకుండా ఎండాడ దగ్గరే ఆపేసి భీమిలివైపు మళ్లించారు.పలువురు టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు రుషికొండ భూములను పరిశీలించాలని భావించారు.
అంతకుముందు సీఎం జగన్పై చంద్రబాబు మండిపడ్డారు.ఏపీని నెంబర్వన్గా తీర్చిదిద్దాలని టీడీపీ ప్రయత్నిస్తే.. జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.ప్రస్తుతం జగన్ జే బ్రాండ్, గంజాయి, డ్రగ్స్కు ఏపీని కేరాఫ్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు.
దాదాపు 8 లక్షల కోట్ల అప్పుకు వడ్డీలు ఎవరు కట్టాలని ప్రశ్నించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా పన్నులు వేశారని పేర్కొన్నారు. జగన్ది ఐరన్లెగ్ అన్న చంద్రబాబు..అతను ఉన్నంతవరకూ ఏ పరిశ్రమా రాదని కామెంట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







