'మేజర్' ట్రైలర్..విడుదల చేసిన మహేశ్ బాబు
- May 09, 2022
హైదరాబాద్: విభిన్నమైన కథలను ఎంచుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. మేజర్ సందీప్ గా అడివి శేష్ నటించాడు అనడం కన్నాజీవించాడు అని చెప్పాలి. దేశం కోసం తల్లిదండ్రులను, భార్యను వదిలి.. తన ప్రాణాలను పణంగా పెట్టిన ఒక సోల్జర్ కథ ఇది.
ఉన్నికృష్ణన్ చిన్నతనం నుంచి అతను దేశం కోసం ప్రాణాలు వదిలేవరకు అన్ని ముఖ్యమైన సంఘటనలను ఈ ట్రైలర్ లో చూపించారు. “నా కొడుకు.. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్.. వెనకడుగేసే అవకాశమే లేదు.. తప్పించుకొనే దారి ఉంది. ముందుకు వెళ్తే చనిపోతాడని తెలుసు.. అయినా వెళ్ళాడు.. చావు కళ్లలోకి చూసి.. నువ్వు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ.. నా దేశాన్ని కాదు”అంటూ ప్రకాష్ రాజ్ భావోద్వేగంతో చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్క భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తున్నాయి. ఇక ఆ దాడుల్లో చిక్కుకున్న ఒక యువతి లా శోభితా దూళిపాళ్ల కనిపించింది. మొత్తానికి ట్రైలర్ గూస్ బంప్స్ తో పాటు భావోద్వాగానికి గురయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని తెలుగు హిందీ మలయాళ భాషల్లో 2022 జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో శేష్ ఎన్ని రికార్డులు సాదిస్తాడో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- ఇరాన్ తాజా దాడులను ఖండించిన బహ్రెయిన్..!!
- 70 మంది నర్సులను సత్కరించిన ఇండియన్ లేడీస్ అసోసియేషన్..!!
- కువైట్, బీరుట్ కు సర్వీసులను నిలిపివేసిన సలామ్ ఎయిర్..!!
- వర్క్ ప్లేస్ లో హీట్ స్ట్రెస్ ఎదుర్కోవడానికి MoPH టిప్స్..!!
- తాజా పరిణామాల పై సౌదీ క్రౌన్ ప్రిన్స్, లెబనాన్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- పిల్లల స్పోర్ట్స్ ట్రైనింగ్ పై హీట్ స్ట్రెస్ ఎఫెక్ట్..పేరెంట్స్, డాక్టర్లు ఆందోళన..!!
- తాత్కాలికంగా మూసివేసిన గగనతలాన్ని తిరిగి తెరిచిన కువైట్
- ఢిల్లీ అగ్నిప్రమాదం కేసులో హోటల్ వంటవాడు అరెస్ట్
- NRIలకు శుభవార్త..ఆ రూల్ మార్చేసిన టీటీడీ
- ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ నిరసన..పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు









