'మేజర్' ట్రైలర్..విడుదల చేసిన మహేశ్ బాబు
- May 09, 2022హైదరాబాద్: విభిన్నమైన కథలను ఎంచుకొని టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. ఇక తాజాగా ఆయన నటించిన చిత్రం ‘మేజర్’. శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా, GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మిస్తున్నారు. 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం విదితమే ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఉద్వేగానికి గురిచేస్తోంది. మేజర్ సందీప్ గా అడివి శేష్ నటించాడు అనడం కన్నాజీవించాడు అని చెప్పాలి. దేశం కోసం తల్లిదండ్రులను, భార్యను వదిలి.. తన ప్రాణాలను పణంగా పెట్టిన ఒక సోల్జర్ కథ ఇది.
ఉన్నికృష్ణన్ చిన్నతనం నుంచి అతను దేశం కోసం ప్రాణాలు వదిలేవరకు అన్ని ముఖ్యమైన సంఘటనలను ఈ ట్రైలర్ లో చూపించారు. “నా కొడుకు.. మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్.. వెనకడుగేసే అవకాశమే లేదు.. తప్పించుకొనే దారి ఉంది. ముందుకు వెళ్తే చనిపోతాడని తెలుసు.. అయినా వెళ్ళాడు.. చావు కళ్లలోకి చూసి.. నువ్వు నా జీవితాన్ని తీసుకోవచ్చు కానీ.. నా దేశాన్ని కాదు”అంటూ ప్రకాష్ రాజ్ భావోద్వేగంతో చెప్పిన డైలాగ్ ప్రతి ఒక్క భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకొనేలా చేస్తున్నాయి. ఇక ఆ దాడుల్లో చిక్కుకున్న ఒక యువతి లా శోభితా దూళిపాళ్ల కనిపించింది. మొత్తానికి ట్రైలర్ గూస్ బంప్స్ తో పాటు భావోద్వాగానికి గురయ్యేలా చేస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని తెలుగు హిందీ మలయాళ భాషల్లో 2022 జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమాతో శేష్ ఎన్ని రికార్డులు సాదిస్తాడో వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ