జక్కన్న-మహేశ్ మూవీ స్టోరీ లైన్ చాలా డిఫరెంట్ - లీక్ చేసిన జక్కన్న ఫాదర్
- May 11, 2022రీసెంట్ గా RRR సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న దర్శక ధీరుడు రాజమౌళి..నెక్స్ట్ సినిమా ఎప్పుడు మొదలు అవుతుందా అంటూ అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
జనరల్ గా సినిమాకి సినిమాకి మధ్య భారీ గ్యాప్ తీసుకునే జక్కన్న..ఈసారి మాత్రం సినిమాను చాలా త్వరగానే స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. మనకు తెలిసిందే రాజమౌళి తన నెక్స్ట్ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించిన అఫిషియల్ ప్రకటన ఎప్పుడో వచ్చేసింది. కానీ, మ్యాటర్ మాత్రం ఇంచు కూడా ముందుకు కదలడం లేదు.
ప్రజెంట్ సర్కారి వారి పాట సినిమా ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్న మహేష్.. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఒక నెల గ్యాప్ తీసుకుని..తన నెక్స్ట్ సినిమా ని సెట్స్ పైకి ఎక్కించనున్నారట. త్రివిక్రమ్ కూడా ఈ సినిమా కి ఎక్కువ టై తీసుకోకుండా ఫాస్ట్ గా షెడ్యూల్స్ ఫినిష్ చేసి నవంబర్ లోపే షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యిన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ తరువాత మహేశ్ మరో నెల గ్యాప్ తీసుకుని..డైరెక్ట్ గా జక్కన్న సినిమా ను సెట్స్ పై ఎక్కిస్తాడట. వన్స్ సినిమా స్టార్ట్ అయ్యాక ఆ సినిమా షూటింగ్ రెండెళ్లు పడుతుందో.. మూడేళ్లు పడుతుందో ..ఆ దేవుడి కే తెలియలి.
ఇక ఈ సినిమా పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు జక్కన్న ఫాదర్ విజయేంద్ర ప్రసాద్. ఇటీవల ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో విజయేంద్ర ప్రసాద్ కు.. జక్కన్న-మహేశ్ మూవీపై ఓ ప్రశ్నఎదురైంది. దీనికి సమాధనం ఇస్తూ..'రాజమౌళి మహేశ్ తో తీసే సినిమా చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూడని కొత్త కధ ఇది.ఈ మూవీ సెట్పైకి వచ్చే ఏడాది ప్రారంభం అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. సినిమా మెయిన్ లైన్ అడవి ని బేస్ చేసుకునే ఉంటుంది. షూటింగ్ కూడా అడవుల్లో నే తీయ్యాలని అనుకుంటున్నాం. ఖచ్చితం గా మహేశ్ కు ఇది ఓ మర్చిపోలేని సినిమా అవుతుంది'అంటూ చెప్పుకొచ్చారు విజయేంద్ర ప్రసాద్. దీంతో సినిమా పై భారీ అంచానలను పెట్టేసుకుంటున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు