అసని తుపాను: తీరానికి కొట్టుకొచ్చిన బంగారు మందిరం..ఆశ్చర్యంలో జనం
- May 11, 2022
బంగాళాఖాతంలో అసని తుపాను అల్లకల్లోలం సృష్టిస్తోంది. సముద్రతీర ప్రాంతాల్లో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అసని తుపాను ప్రభావానికి తీరప్రాంతమంతా అలజడిగా మారింది. తుపాను కారణంగా సంతబొమ్మాళి సున్నాపల్లి రేవుకు ఓ వింత రథం కొట్టుకొచ్చింది. అది చూడటానికి బంగారు వర్ణంతో తళతళమని మెరిసిపోతోంది. సముద్రం ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన ఆ రథం విదేశానికి చెందినగా భావిస్తున్నారు.
ఈ వింతైన రథాన్ని చూసేందుకు అక్కడి ప్రాంతవాసులు భారీగా తరలివస్తున్నారు. కొట్టుకువచ్చిన వింతైన ఈ రథంపై 16-1-2022 అని విదేశీ భాషలో రాసి ఉంది. మలేషియా, థాయిలాండ్ లేదా జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చునని మత్స్యకారులు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఎన్నో పెను తుపానులు వచ్చాయని, ఎప్పుడూ కూడా ఇలాంటి రథం వంటి వింతైనవి కొట్టుకురాలేదంటున్నారు. ఒడ్డుకు కొట్టుకువచ్చిన ఈ బంగారు రథాన్ని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ ఆ రథం ఎక్కడినుంచి కొట్టుకువచ్చింది అనేది తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు
- భారత్లో 38,500 దాటిన రిజిస్టర్డ్ డ్రోన్ల సంఖ్య
- సౌదీలోని కొన్ని నగరాల్లో తగ్గిన చలి..!!









