పన్ను ఎగవేసిన ప్రవాసుడికి జరిమానా, జైలు శిక్ష
- May 13, 2022
మస్కట్: పన్ను రిటర్నులను సమర్పించడంలో విఫలమైన ఒక ప్రవాసికి OMR 1,000 జరిమానాతోపాటు ఒక నెల జైలు శిక్షను విధించారు. జైలు శిక్ష అనంతరం అతన్ని ఒమన్ సుల్తానేట్ నుండి బహిష్కరించనున్నారు. రాయల్ డిక్రీ నంబర్ జారీ చేసిన ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించినందుకు సదరు ప్రవాసిపై చర్యలు తీసుకున్నారు. ఈమేరకు విలాయత్ ఆఫ్ అల్ బురైమిలోని ఫస్ట్ ఇన్స్టాన్స్ కోర్ట్ ఇటీవల కోర్టు తీర్పును జారీ చేసింది. నిందితుడు పన్ను రిటర్నులను సమర్పించలేదని, ఇన్ కం టాక్స్ చట్టంలోని రాయల్ డిక్రీ నెం.28/2009 పన్ను నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డాడని పన్ను అథారిటీ తెలిపింది. న్యాయ నియంత్రణ అధికారులు విచారణలు నిర్వహించి, సాక్ష్యాలను సేకరించి, రికార్డులను తయారు చేశారు. ఆపై కేసు ఫైల్ చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్లోని పబ్లిక్ ఫండ్స్, మనీ లాండరింగ్ కేసుల విభాగానికి రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







