షేక్ ఖలీఫా మృతి..వాయిదా పడ్డ ఐఫా (IIFA) అవార్డ్స్
- May 15, 2022
అబుధాబి: దివంగత యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతిపై యూఏఈ అంతటా 40 రోజుల సంతాపదినాలు ప్రటకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అబుధాబి లో జరగాల్సిన IIFA అవార్డుల 22వ ఎడిషన్ వాయిదా వేయాలని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) తన నిర్ణయాన్ని ప్రకటించింది.
మే 20 మరియు 21 తేదీల్లో జరగాల్సిన ఈ అవార్డుల వేడుక ఇప్పుడు జూలై 14, 15 మరియు 16 తేదీల్లో అబుధాబి లో నిర్వహించబడుతుంది అని అధికారిక ప్రకటన వెలువడింది.
అబుధాబి లో వచ్చే వారం జరగాల్సిన కల్చర్ సమ్మిట్ అబుధాబి 2022 యొక్క ఐదవ ఎడిషన్ కూడా వాయిదా పడినట్టు అబుధాబి సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ తెలిపింది.
అబుధాబి నే కాకుండా దుబాయ్, షార్జా మరియు ఇతర ఎమిరేట్స్లో కూడా షేక్ ఖలీఫా మృతికి సంతాపసూచికంగా అనేక సాంస్కృతిక మరియు వినోద కార్యక్రమాలు రద్దు చేయబడ్డాయి.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







