ప్రవాసుల వైద్య పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఆరోగ్య మంత్రి
- May 16, 2022
కువైట్: షువైఖ్లోని ప్రవాస వైద్య పరీక్షా కేంద్రాన్ని ఆరోగ్య మంత్రి డాక్టర్ ఖలీద్ అల్-సయీద్ సందర్శించారు. ఈ సందర్భంగా సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే పరీక్ష కేంద్రం సామర్థ్యం, సేవల నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ సూచనలను ఆయన చేశారు. మంత్రి పర్యటన సందర్భంగా మంత్రితో పాటు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ముస్తఫా రెడా, పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ ముహమ్మద్ అల్-సయీదాన్ ఉన్నారు. ఆదివారం నుండి గురువారం వరకు గృహ కార్మికులకు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు (కువైట్ స్పాన్సర్తో పాటు), మధ్యాహ్నం 1 నుండి 7 గంటల వరకు మిగిలిన ప్రవాస కార్మికులకు స్లాట్లు కేటాయించాలని ఆదేశించారు. అలాగే శనివారం గృహ సహాయకుల కోసం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు (కువైట్ స్పాన్సర్తో పాటు) కేటాయించాలని సూచించారు. రద్దీని నివారించడానికి, ముందస్తు రిజర్వేషన్ ప్రకారం నిర్దేశించిన తేదీలలో పరీక్షా కేంద్రాలకు రావాలని సందర్శకులకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









