ప్రవాసుల వైద్య పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఆరోగ్య మంత్రి
- May 16, 2022
కువైట్: షువైఖ్లోని ప్రవాస వైద్య పరీక్షా కేంద్రాన్ని ఆరోగ్య మంత్రి డాక్టర్ ఖలీద్ అల్-సయీద్ సందర్శించారు. ఈ సందర్భంగా సేవలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అలాగే పరీక్ష కేంద్రం సామర్థ్యం, సేవల నాణ్యతను మెరుగుపరచడానికి వివిధ సూచనలను ఆయన చేశారు. మంత్రి పర్యటన సందర్భంగా మంత్రితో పాటు మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ ముస్తఫా రెడా, పబ్లిక్ హెల్త్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ ముహమ్మద్ అల్-సయీదాన్ ఉన్నారు. ఆదివారం నుండి గురువారం వరకు గృహ కార్మికులకు ఉదయం 7:30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు (కువైట్ స్పాన్సర్తో పాటు), మధ్యాహ్నం 1 నుండి 7 గంటల వరకు మిగిలిన ప్రవాస కార్మికులకు స్లాట్లు కేటాయించాలని ఆదేశించారు. అలాగే శనివారం గృహ సహాయకుల కోసం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 3:00 వరకు (కువైట్ స్పాన్సర్తో పాటు) కేటాయించాలని సూచించారు. రద్దీని నివారించడానికి, ముందస్తు రిజర్వేషన్ ప్రకారం నిర్దేశించిన తేదీలలో పరీక్షా కేంద్రాలకు రావాలని సందర్శకులకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







