ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చిన కువైట్
- May 18, 2022
కువైట్ సిటీ: కువైట్ లో ప్రభుత్వం ఆరోగ్యశాఖకు చెందిన ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. ఉద్యోగులు ఎవరైతే సెలవులు వినియోగించుకోలేదో వారికి ఈ ఆఫర్.ఉద్యోగులు వాడుకోకుండా అలాగే మిగిలిపోయిన సెలవుల్ని డబ్బు గా మార్చుకునే అవకాశం కల్పించింది. అంటే.. ఎన్ని ఎక్కువ లీవ్స్ ఉంటే అంత డబ్బు అన్నమాట.దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు మిగిలిపోయిన తమ సెలవుల్ని డబ్బు గా మార్చుకునేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దీనికోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది.
సివిల్ ఐడీ నంబర్తో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు సమయంలో కావాల్సిన వివరాలతో పాటు మిగిలిపోయిన సెలవులు ఎన్ని ఉన్నాయో ఎంటర్ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగి సెలవుల వివరాలను ఆడిట్ విభాగం ద్వారా నిర్ధారించుకున్న తర్వాత వాటి తాలూకు నగదును ఆ ఉద్యోగి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 15వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూన్ 30 వరకు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 1 నుంచి పాన్ దరఖాస్తులో మార్పులు
- ముంబై ఇండియన్స్ కొత్త రన్ చేజ్ రికార్డు
- డిజిటల్ చెల్లింపులకు 2FA తప్పనిసరి
- ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించిన ఇండిగో ప్రయాణికుడు
- ప్రాంతీయ పరిణామాలపై భారత ప్రధాని, క్రౌన్ ప్రిన్స్ చర్చలు..!!
- సౌదీలో రోడ్డు ప్రమాదంలో బహ్రెయిన్ వాసి మృతి..!!
- వర్షం వల్ల కలిగే నష్టానికి బీమా వర్తించదా? Dh25,000 బిల్లులు కట్టాల్సిందేనా?
- సంక్షోభ నిర్వహణలో ఖతార్ విజయం సాధించింది: న్యాయశాఖ మంత్రి
- ఒమన్లో 404 మందిని రక్షించిన రెస్క్యూ టీమ్స్..!!
- 2025లో కేసుల సంఖ్యలో 7.6% పెరుగుదల: కువైట్









