ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చిన కువైట్
- May 18, 2022
కువైట్ సిటీ: కువైట్ లో ప్రభుత్వం ఆరోగ్యశాఖకు చెందిన ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. ఉద్యోగులు ఎవరైతే సెలవులు వినియోగించుకోలేదో వారికి ఈ ఆఫర్.ఉద్యోగులు వాడుకోకుండా అలాగే మిగిలిపోయిన సెలవుల్ని డబ్బు గా మార్చుకునే అవకాశం కల్పించింది. అంటే.. ఎన్ని ఎక్కువ లీవ్స్ ఉంటే అంత డబ్బు అన్నమాట.దీంతో ఒక్కసారిగా ఉద్యోగులు మిగిలిపోయిన తమ సెలవుల్ని డబ్బు గా మార్చుకునేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తులు సమర్పిస్తున్నారు. దీనికోసం ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చింది.
సివిల్ ఐడీ నంబర్తో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.దరఖాస్తు సమయంలో కావాల్సిన వివరాలతో పాటు మిగిలిపోయిన సెలవులు ఎన్ని ఉన్నాయో ఎంటర్ చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇలా దరఖాస్తు చేసుకున్న ఉద్యోగి సెలవుల వివరాలను ఆడిట్ విభాగం ద్వారా నిర్ధారించుకున్న తర్వాత వాటి తాలూకు నగదును ఆ ఉద్యోగి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు సుమారు 15వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జూన్ 30 వరకు ఉద్యోగులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో తగ్గిన పర్సనల్ లోన్ డిమాండ్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనలకు ప్రత్యామ్నాయ శిక్షలు..!!
- సౌదీలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఆపరేటింగ్ ఫీ మినహాయింపు..!!
- బహ్రెయిన్ లో నీటి భద్రతకు భరోసా..హిద్ వాటర్ ప్లాంటు..!!
- ఒమన్లో విండో టింట్ పరిమితి 50%.. ROP క్లారిటీ..!!
- ఖతార్లో వారమంతా బలమైన గాలులు.. అలెర్ట్ జారీ..!!
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!







