యూఏఈలోని భారతీయ విద్యార్థులు, విదేశీయులు ఎన్ఐటి, ఐఐటీల్లో 15 శాతం సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు
- May 18, 2022
యూఏఈ: యూఏఈలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు, భారతదేశంలోని ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్లో 15 శాతం కోటాకి దరఖాస్తు చేసుకోవచ్చు. భారత విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ కేటగిరీలో 2022-2 శాతానికిగాను ఈ కోటా పేర్కొన్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ - మెయిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సుమారు 15 శాతం సీట్లు నిట్ మరియు ఐఐటిలలో ఈ కోటా కింద పొందే వీలుంది. సుమారుగా వీటి మొత్తం సంఖ్య 5000 వరకూ వుండొచ్చు. 3900 అండర్ గ్రాడ్యుయేట్, 1,300 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు ఈ స్కీమ్ ద్వారా భర్తీ చేయబడతాయి. దాసా స్కీమ్ కింద అప్లికేషన్ ఫీజు 300 డాలర్లు కాగా, ట్యూషన్ ఫీజు 8,000 డాలర్లు. భారత సంతతి విద్యార్థులకు 1,25,000 రూపాయల ట్యూషన్ ఫీజు వుంటుంది. దాసా స్కీమ్లో కేవలం విదేశీ జాతీయులు ఏ దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా దరఖాస్తు చేసుకోవచ్చు. 300 జిఆర్ఇ స్కోర్ కనీసం సంపాదించాల్సి వుంటుంది. 300 డాలర్లు నాన్ రిఫండబుల్ పీజు, 4,000 డాలర్లు తొలి సెమిస్టర్ ఫీజు వుంటుంది.
తాజా వార్తలు
- ఎస్ఆర్హెచ్ పై బెంగళూరు ఘన విజయం
- ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యం..‘టీచ్ ఫర్ ఛేంజ్’
- ఏపీలో బంగారు గనుల తవ్వకాలకు సర్వం సిద్ధం
- మిడిలీస్టులోని క్లాస్ బోర్డ్ పరీక్షల కోసం ప్రత్యామ్నాయ అసెస్మెంట్ స్కీమ్..!!
- ఖతార్ లో భద్రతా సిబ్బందికి సహకరించాలని పిలుపు..!!
- కువైట్ విమానాశ్రయంపై డ్రోన్ అటాక్స్.. దెబ్బతిన్న రాడార్ వ్యవస్థ..!!
- బహ్రెయిన్లోని రిటైల్ అవుట్లెట్లలో తనిఖీలు..దుకాణం మూసివేత..!!
- ఫోటోలు, వీడియోలు తీయడం పై సౌదీ అరేబియా హెచ్చరికలు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన యూఏఈ, ఉక్రెయిన్ ప్రెసిడెండ్స్..!!
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం









