యూఏఈలోని భారతీయ విద్యార్థులు, విదేశీయులు ఎన్ఐటి, ఐఐటీల్లో 15 శాతం సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు

- May 18, 2022 , by Maagulf
యూఏఈలోని భారతీయ విద్యార్థులు, విదేశీయులు ఎన్ఐటి, ఐఐటీల్లో 15 శాతం సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు

యూఏఈ: యూఏఈలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు, భారతదేశంలోని ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్‌లో 15 శాతం కోటాకి దరఖాస్తు చేసుకోవచ్చు. భారత విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ కేటగిరీలో 2022-2 శాతానికిగాను ఈ కోటా పేర్కొన్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ - మెయిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సుమారు 15 శాతం సీట్లు నిట్ మరియు ఐఐటిలలో ఈ కోటా కింద పొందే వీలుంది. సుమారుగా వీటి మొత్తం సంఖ్య 5000 వరకూ వుండొచ్చు. 3900 అండర్ గ్రాడ్యుయేట్, 1,300 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు ఈ స్కీమ్ ద్వారా భర్తీ చేయబడతాయి. దాసా స్కీమ్ కింద అప్లికేషన్ ఫీజు 300 డాలర్లు కాగా, ట్యూషన్ ఫీజు 8,000 డాలర్లు. భారత సంతతి విద్యార్థులకు 1,25,000 రూపాయల ట్యూషన్ ఫీజు వుంటుంది. దాసా స్కీమ్‌లో కేవలం విదేశీ జాతీయులు ఏ దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా దరఖాస్తు చేసుకోవచ్చు. 300 జిఆర్ఇ స్కోర్ కనీసం సంపాదించాల్సి వుంటుంది. 300 డాలర్లు నాన్ రిఫండబుల్ పీజు, 4,000 డాలర్లు తొలి సెమిస్టర్ ఫీజు వుంటుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com