యూఏఈలోని భారతీయ విద్యార్థులు, విదేశీయులు ఎన్ఐటి, ఐఐటీల్లో 15 శాతం సీట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు
- May 18, 2022
యూఏఈ: యూఏఈలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు, భారతదేశంలోని ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్లో 15 శాతం కోటాకి దరఖాస్తు చేసుకోవచ్చు. భారత విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ అడ్మిషన్ ఆఫ్ స్టూడెంట్స్ అబ్రాడ్ కేటగిరీలో 2022-2 శాతానికిగాను ఈ కోటా పేర్కొన్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ - మెయిన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సుమారు 15 శాతం సీట్లు నిట్ మరియు ఐఐటిలలో ఈ కోటా కింద పొందే వీలుంది. సుమారుగా వీటి మొత్తం సంఖ్య 5000 వరకూ వుండొచ్చు. 3900 అండర్ గ్రాడ్యుయేట్, 1,300 పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు ఈ స్కీమ్ ద్వారా భర్తీ చేయబడతాయి. దాసా స్కీమ్ కింద అప్లికేషన్ ఫీజు 300 డాలర్లు కాగా, ట్యూషన్ ఫీజు 8,000 డాలర్లు. భారత సంతతి విద్యార్థులకు 1,25,000 రూపాయల ట్యూషన్ ఫీజు వుంటుంది. దాసా స్కీమ్లో కేవలం విదేశీ జాతీయులు ఏ దేశంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా దరఖాస్తు చేసుకోవచ్చు. 300 జిఆర్ఇ స్కోర్ కనీసం సంపాదించాల్సి వుంటుంది. 300 డాలర్లు నాన్ రిఫండబుల్ పీజు, 4,000 డాలర్లు తొలి సెమిస్టర్ ఫీజు వుంటుంది.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







