బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్ధన తో మంత్రి కేటీఆర్ సమావేశం

- May 19, 2022 , by Maagulf
బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్ధన తో మంత్రి కేటీఆర్ సమావేశం

లండన్: బ్రిటన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మినిస్టర్ రనిల్ జయవర్ధన తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు.లండన్లోని మంత్రి జయవర్ధన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వం ప్రాధాన్యతలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతులు,పెట్టుబడి అవకాశాలకు సంబంధించి, వివిధ అంశాలపైన  చర్చించారు.తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో పాల్గొనాల్సిందిగా జయవర్ధనకు మంత్రి కేటీఆర్ ఆహ్వానం పలికారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ts-ipass విధానం గురించి తెలుసుకున్న బ్రిటన్ మంత్రి, ఈ విధానం పైన ప్రశంసలు కురిపించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com