మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ ప్రభుత్వం ఆంక్షలు..
- May 20, 2022
కాబుల్: అఫ్ఘానిస్తాన్లోని తాలిబాన్ సర్కార్ మహిళల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించింది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను కప్పుకోవాలని కొద్దిరోజుల క్రితమే ఆదేశాలిచ్చిన తాలిబాన్ ప్రభుత్వం… అదే రకమైన ఆదేశాలను మహిళా జర్నలిస్టులకు కూడా చేసింది. న్యూస్ రీడర్ న్యూస్ చదువుతున్న సమయంలో తమ మొఖాలు కనిపించకుండా కప్పుకోవాలని ఆదేశించింది.
మీడియా సంస్థలు కచ్చితంగా ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలని హుకుం జారీచేసింది. రేపటివరకు వెసులుబాటు వుంటుందని, ఆ తర్వాత ఈ ప్రతిపాదనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధనలు పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్మాస్క్లు ఉపయోగించారు కదా.. ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై మహిళల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలోనూ తాలిబన్ల పాలనలో ఇలాంటి అరాచకాలనే ఎదుర్కొన్నారు అక్కడి మహిలు. అయితే మధ్యలో ప్రజాప్రభుత్వం ఏర్పడడంతో స్వేచ్ఛగా బతికారు. ఇప్పుడు మళ్లీ కఠిన పరిస్థితుల్లో గడుపుతున్నారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









