మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ ప్రభుత్వం ఆంక్షలు..
- May 20, 2022
కాబుల్: అఫ్ఘానిస్తాన్లోని తాలిబాన్ సర్కార్ మహిళల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించింది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను కప్పుకోవాలని కొద్దిరోజుల క్రితమే ఆదేశాలిచ్చిన తాలిబాన్ ప్రభుత్వం… అదే రకమైన ఆదేశాలను మహిళా జర్నలిస్టులకు కూడా చేసింది. న్యూస్ రీడర్ న్యూస్ చదువుతున్న సమయంలో తమ మొఖాలు కనిపించకుండా కప్పుకోవాలని ఆదేశించింది.
మీడియా సంస్థలు కచ్చితంగా ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలని హుకుం జారీచేసింది. రేపటివరకు వెసులుబాటు వుంటుందని, ఆ తర్వాత ఈ ప్రతిపాదనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధనలు పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్మాస్క్లు ఉపయోగించారు కదా.. ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై మహిళల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలోనూ తాలిబన్ల పాలనలో ఇలాంటి అరాచకాలనే ఎదుర్కొన్నారు అక్కడి మహిలు. అయితే మధ్యలో ప్రజాప్రభుత్వం ఏర్పడడంతో స్వేచ్ఛగా బతికారు. ఇప్పుడు మళ్లీ కఠిన పరిస్థితుల్లో గడుపుతున్నారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







