మహిళా జర్నలిస్టులపై తాలిబాన్ ప్రభుత్వం ఆంక్షలు..
- May 20, 2022
కాబుల్: అఫ్ఘానిస్తాన్లోని తాలిబాన్ సర్కార్ మహిళల విషయంలో మరిన్ని ఆంక్షలు విధించింది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖాలను కప్పుకోవాలని కొద్దిరోజుల క్రితమే ఆదేశాలిచ్చిన తాలిబాన్ ప్రభుత్వం… అదే రకమైన ఆదేశాలను మహిళా జర్నలిస్టులకు కూడా చేసింది. న్యూస్ రీడర్ న్యూస్ చదువుతున్న సమయంలో తమ మొఖాలు కనిపించకుండా కప్పుకోవాలని ఆదేశించింది.
మీడియా సంస్థలు కచ్చితంగా ఈ విషయాన్ని తప్పకుండా పాటించాలని హుకుం జారీచేసింది. రేపటివరకు వెసులుబాటు వుంటుందని, ఆ తర్వాత ఈ ప్రతిపాదనను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ నిబంధనలు పాటించకుంటే ఏం చేస్తారని అడిగితే.. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల గురించి ఇప్పుడే స్పందించమని పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.
పైగా కరోనా టైంలో ఎలాగూ ఫేస్మాస్క్లు ఉపయోగించారు కదా.. ఇప్పుడే అవే వాడమని ఉచిత సలహా ఇచ్చారు. దీనిపై మహిళల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలోనూ తాలిబన్ల పాలనలో ఇలాంటి అరాచకాలనే ఎదుర్కొన్నారు అక్కడి మహిలు. అయితే మధ్యలో ప్రజాప్రభుత్వం ఏర్పడడంతో స్వేచ్ఛగా బతికారు. ఇప్పుడు మళ్లీ కఠిన పరిస్థితుల్లో గడుపుతున్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







