గాల్లో ఉండగానే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్...
- May 20, 2022
ముంబై: ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాల్లోకి ఎగిరిన నిముషాల వ్యవధిలోనే విమానంలో తలెత్తిన సాంకేతికత సమస్య కారణంగా విమానం ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో దించేశారు. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో వివరాలు ఇలా ఉన్నాయి.టాటా గ్రూప్ నాకు చెందిన ఎయిర్ ఇండియా ఏ320 నియో విమానం శుక్రవారం ఉదయం 9:43కి ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో బయలుదేరింది. విమానం టేక్ ఆఫ్ అయిన 20 నిముషాల్లోనే సాంకేతిక సమస్య కారణంగా ఒక ఇంజిన్ పూర్తిగా ఆగిపోయింది.
ఇది గమనించిన పైలట్లు, వెంటనే విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంకు మళ్లిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో కొంత భయాందోళనకు గురైన ప్రయాణికులు..విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను మరొక విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ మరియు మెయింటెనెన్స్ నిపుణుల ఆధ్వర్యంలో సమస్య కారణాలు అన్వేషిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ అధికారులు విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ









