గాల్లో ఉండగానే ఆగిపోయిన ఎయిర్ ఇండియా విమాన ఇంజిన్...
- May 20, 2022
ముంబై: ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమాన ప్రయాణికులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. గాల్లోకి ఎగిరిన నిముషాల వ్యవధిలోనే విమానంలో తలెత్తిన సాంకేతికత సమస్య కారణంగా విమానం ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంలో దించేశారు. శుక్రవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో వివరాలు ఇలా ఉన్నాయి.టాటా గ్రూప్ నాకు చెందిన ఎయిర్ ఇండియా ఏ320 నియో విమానం శుక్రవారం ఉదయం 9:43కి ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి బెంగళూరుకు ప్రయాణికులతో బయలుదేరింది. విమానం టేక్ ఆఫ్ అయిన 20 నిముషాల్లోనే సాంకేతిక సమస్య కారణంగా ఒక ఇంజిన్ పూర్తిగా ఆగిపోయింది.
ఇది గమనించిన పైలట్లు, వెంటనే విమానాన్ని తిరిగి ముంబై విమానాశ్రయంకు మళ్లిస్తున్నట్టు అనౌన్స్ చేశారు. దీంతో కొంత భయాందోళనకు గురైన ప్రయాణికులు..విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రయాణికులను మరొక విమానంలో గమ్యస్థానానికి చేర్చినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని పేర్కొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ మరియు మెయింటెనెన్స్ నిపుణుల ఆధ్వర్యంలో సమస్య కారణాలు అన్వేషిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ అధికారులు విచారణ చేస్తున్నారు.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







