తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించిన చంద్రబాబు
- May 21, 2022
అమరావతి: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు వర్చ్యువల్ పద్దతిలో ప్రారంభించారు. సుమారు 50 లక్షల ఖర్చుతో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు అయ్యింది. ఎపిలో కుప్పం, టెక్కలిలలో ఇప్పటికే ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిద్దం అయిన ఆక్సిజన్ ప్లాంట్ ను చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. విపత్తుల సమయంలో ఎన్జివోలు, ఇతర సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వంతో కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చంద్రబాబు అన్నారు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సాధించిన విజయాలను చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. విద్య, వైద్యంతో పాటు విపత్తుల సమయంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేసిన సేవలను గుర్తు చేశారు. ట్రస్ట్ ఏర్పాటు అయిన తరువాత 11 వేల హెల్త్ క్యాంప్ లు నిర్వహించారని....సుమారు 18 కోట్ల రూపాయల విలువైన మందులు, ఆహారం తో పాటు ఇతర సాయం బాధితులకు అందిందని చంద్రబాబు అన్నారు. 2009 కర్నూలు వరదలు, 2021లో కడప, నెల్లూరు జిల్లాలలో వరద బాధితులకు ట్రస్ట్ చేసిన సాయం గురించి ప్రస్తావించారు. ఇక కోవిడ్ సమయంలో రెండు కోట్ల రూపాయలు మందులు, ఇతర వైద్య సాయం కోసం ఖర్చు చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరు తాము సంపాదించిన దానిలో కొంత అయినా తిరిగి సమాజంపై ఖర్చు పెట్టాలని చంద్రబాబు కోరారు. తద్వారా సమాజంలో ఉత్తమ ఫలితాలు రాబట్ట వచ్చని చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో రాజేంద్రకుమార్, మహబూబాబాద్ అడిషనల్ కలెక్టర్ అభిలాష తో పాటు అసుపత్రి సిబ్బంది, ట్రస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







