ఖతార్లో మంకీపాక్స్ కేసు నమోదు కాలేదు: మంత్రిత్వ శాఖ
- May 23, 2022
దోహా: ఖతార్ లో ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసు నమోదు కాలేదని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH) తెలిపింది. మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు, ఏవైనా అనుమానిత కేసులు కనిపిస్తే వాటిని ముందస్తుగా గుర్తించేందుకు పూర్తి స్థాయి ప్రజారోగ్య చర్యలను తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంకీపాక్స్ లక్షణాలు కనిపిస్తే ఆరోగ్య అధికారులకు నివేదించాలని ప్రజలకు సూచించింది. అలాగే మంకీపాక్స్ లక్షణాలతో వచ్చే వారికి సేవలు అందించాలని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలోని ఆరోగ్య సంరక్షణ నిపుణులను మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మే 13 నుండి ఇప్పటి వరకు కనీసం 12 దేశాల్లో మంకీపాక్స్ కేసులను గుర్తించారు. అయితే ఆ దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందలేదు. మంకీపాక్స్ అనేది పశ్చిమ, మధ్య ఆఫ్రికాలో ఎక్కువగా కనిపించే వైరల్ ఇన్ఫెక్షన్. అప్పుడప్పుడు ఇది ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తుంది. మంకీపాక్స్ వ్యాధి సాధారణంగా జ్వరం, కండరాల నొప్పులు, కణుపుల వాపు(వాటర్ బబుల్స్) లక్షణాలను కలిగి ఉంటుంది. చికెన్పాక్స్ లాంటి దద్దుర్లు చేతులు, ముఖంపై కనిపిస్తాయని నిపుణులు చెబతున్నారు.
తాజా వార్తలు
- లెజెండరీ యాక్షన్ స్టార్ చక్ నోరిస్ కన్నుమూత!
- వాట్సాప్లో అదిరిపోయే అప్డేట్
- శంకర నేత్రాలయ USA న్యూజెర్సీ వారి సంగీతం మరియు నృత్య కార్యక్రమం
- 109 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- అక్రమ బెట్టింగ్..300 యాప్ల పై కేంద్రం ఉక్కుపాదం!
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!









