‘శేఖర్’ సినిమాతో పాపం నిర్మాత అన్యాయమైపోయాడుగా.!
- May 24, 2022
సీనియర్ హీరో రాజశేఖర్ లీడ్ రోల్ పోషించిన సినిమా ‘శేఖర్’. జీవితా రాజశేఖర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. వీరి తనయ శివానీ కీలక పాత్ర పోషించింది ఈ సినిమాలో. అయితే, విడుదలైన రెండు రోజులకే ఈ సినిమాని ధియేటర్ నుంచి లేపేశారు.
డిస్టిబ్యూటర్లు డబ్బులు ఎగ్గొట్టారన్న ఆరోపణతో ఈ సినిమాను ధియేటర్ నుంచి లేపేశారు. అంటే విడుదలైన రెండు రోజులకే సినిమా ఆగిపోయిందన్న మాట. నిజంగా రాజశేఖర్కి ఇది చాలా అవమానం. మరోవైపు ఈ సినిమాకి నిర్మాణ పరంగానూ తాము భాగస్వాములమని నిన్న మొన్నటి వరకూ జీవిత, రాజశేఖర్ చెప్పుకున్నారు.
కానీ, ఇప్పుడు మాట మార్చేశారు. అసలు సిసలు నిర్మాతను నేనే అంటూ సుధాకర్ రెడ్డి తన గోడు వెల్లబోసుకుంటున్నాడు. పేరుకు మాత్రమే శివానీ, శివాత్మికలు నిర్మాతలు. ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం నాదే.. సినిమాని అర్ధాంతరంగా ఆపేయడంతో తాను ఘోరంగా నష్టపోయాననీ లబో దిబో మంటున్నాడు సుధాకర్ రెడ్డి.
అయితే, ఈ ఇష్యూ వెనక జీవిత రాజశేఖర్ నడిపిస్తున్న కొత్త డ్రామా ఏమైనా వుందా.? అనే అనుమానాలు లేకపోలేవు. ఎందుకంటే, కేవలం ఇది రాజశేఖర్ సినిమా అన్న కారణంగానే కావాలని ఆయన సినిమాకి నష్టం చేయాలన్నవుద్దేశ్యంతోనే రిలీజైన సినిమాని ఆపేశారు.. అనేది జీవిత రాజశేఖర్ ఆరోపణ.
ఆ యాంగిల్లో సింపథీ గెయిన్ చేయడానికే సుధాకర్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారా.? లేక నిజంగానే నిర్మాతగా సుధాకర్ రెడ్డికి నష్టం జరిగిందా.? అనే కోణంలో కోర్టు వరకూ వెళ్లిన ఈ ఇష్యూపై లోతుగా విచారణ జరుగుతోంది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







