యూఏఈలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
- May 24, 2022
అబుధాబి: యూఏఈలో తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయిందని ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP) ప్రకటించింది. పశ్చిమ ఆఫ్రికా నుండి వచ్చిన 29 ఏళ్ల మహిళలో మంకీపాక్స్ లక్షణాలను గుర్తించామని, వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి..అవసరమైన వైద్యాన్ని అందిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో మంకీపాక్స్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నట్లు యూఏఈ వైద్యాధికారులు తెలిపారు. వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు అత్యున్నత నిర్ధారణ ప్రమాణాలను అనుసరిస్తున్నట్లు, వ్యాధిని నిర్ధారించడానికి ఎపిడెమియోలాజికల్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంకీపాక్స్ కేసుల విషయంలో పుకార్లు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని ప్రజలకు మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..







