రెసిడెన్సీ చట్టంపై కీలక సమావేశం
- May 26, 2022
కువైట్: నేషనల్ అసెంబ్లీ ఇంటీరియర్ మరియు డిఫెన్స్ కమిటీ, దేశంలోని రెసిడెన్సీ చట్టంపై కీలక మార్పులకు సంబంధించి ఓటింగ్ చేయనుంది. ఇన్వెస్టర్లకు 15 ఏళ్ళ రెసిడెన్సీ ఇచ్చేందుకు ఉద్దేశించిన సవరణ కూడా ఇందులో అతి కీలకమైనది. కువైటీ మహిళ తన పిల్లలు అలాగే విదేశీ భర్తకు 10ఏళ్ళ పాటు రెసిడెన్సీ అవకాశం కల్పించేందుకు వీలుగా మరో సవరణ చేయనున్నారు. కువైటీ భర్తల విదేశీ వితంతువులు, వారి పిల్లలు రెగ్యులర్ రెసిడెన్సీ పొందేందుకు కూడా అవసరమైన సవరణలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులైన విదేశీయులు ప్రైవేట్ సెక్టార్లో రెసిడెన్స్ పర్మిట్ పొందడానికి వీల్లేదు (ప్రభుత్వ ఎంప్లాయర్ అనుమతి లేకుండా). పబ్లిక్ ఇంట్రెస్ట్ కోణంలోనూ అలాగే సరైన ఆదాయం లేని కారణంగానూ వలసదారుల్ని డిపోర్ట్ చేసేలా కూడా చట్టానికి సవరణలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!







