రెసిడెన్సీ చట్టంపై కీలక సమావేశం
- May 26, 2022
కువైట్: నేషనల్ అసెంబ్లీ ఇంటీరియర్ మరియు డిఫెన్స్ కమిటీ, దేశంలోని రెసిడెన్సీ చట్టంపై కీలక మార్పులకు సంబంధించి ఓటింగ్ చేయనుంది. ఇన్వెస్టర్లకు 15 ఏళ్ళ రెసిడెన్సీ ఇచ్చేందుకు ఉద్దేశించిన సవరణ కూడా ఇందులో అతి కీలకమైనది. కువైటీ మహిళ తన పిల్లలు అలాగే విదేశీ భర్తకు 10ఏళ్ళ పాటు రెసిడెన్సీ అవకాశం కల్పించేందుకు వీలుగా మరో సవరణ చేయనున్నారు. కువైటీ భర్తల విదేశీ వితంతువులు, వారి పిల్లలు రెగ్యులర్ రెసిడెన్సీ పొందేందుకు కూడా అవసరమైన సవరణలు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులైన విదేశీయులు ప్రైవేట్ సెక్టార్లో రెసిడెన్స్ పర్మిట్ పొందడానికి వీల్లేదు (ప్రభుత్వ ఎంప్లాయర్ అనుమతి లేకుండా). పబ్లిక్ ఇంట్రెస్ట్ కోణంలోనూ అలాగే సరైన ఆదాయం లేని కారణంగానూ వలసదారుల్ని డిపోర్ట్ చేసేలా కూడా చట్టానికి సవరణలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









