ఉగాది సందర్బంగా నేను నా బాయ్ఫ్రెండ్స్'...
- April 07, 2016
కుమారి 21 ఎఫ్ ఫేం హెబ్బాపటేల్, నోయెల్, పునర్నవి ప్రధాన పాత్రలుగా తెరకెక్కనున్న చిత్రం 'నేను నా బాయ్ ఫ్రెండ్స్'. ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శుక్రవారం ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేష్, దిల్రాజు సినిమాటోగ్రాఫర్ ఛోటా కె.నాయుడు, శ్రీకాంత్ అడ్డాలతో పాటు పలువురు హాజరయ్యారు.హెబ్బాపటేల్, పునర్నవిపై క్లాప్ కొట్టి దాసరి నారాయణరావు చిత్రం షూటింగ్ను ప్రారంభించారు. మహాలక్ష్మీ, మానస సమర్పిస్తున్న ఈ చిత్రానికి లక్కీ మీడియా కథను అందించింది.నంద్యాల రవి మాటలు సమకూర్చగా, శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించారు. భాస్కర్ బండి స్క్రీన్ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు. కేరింత ఫేం పార్వతీశం, రావు రమేశ్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









