బాలకృష్ణ వందో సినిమాకు శ్రీకారం..
- April 07, 2016
ఉగాది పర్వదినం సందర్భంగా సినీనటుడు నందమూరి బాలకృష్ణ వందో సినిమాకు శ్రీకారం చుట్టారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాలకృష్ణ తన వందో చిత్రం వివరాలు వెల్లడించారు. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో 'గౌతమి పుత్ర శాతకర్ణి' సినిమాలో నటించనున్నట్లు బాలకృష్ణ ప్రకటించారు. గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించనున్నట్లు చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ తీయాలనుకున్నారు.. కొన్ని కారణాలతో ఆ చిత్రాన్ని తీయలేకపోయారన్నారు. తెలుగువారు తెలుసుకోవాల్సిన చరిత్ర గౌతమి పుత్ర శాతకర్ణి అని వెల్లడించారు. బాలకృష్ణను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









