భారత్ నుంచి హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక విమానాలు
- June 03, 2022
న్యూ ఢిల్లీ: హజ్ యాత్రికుల కోసం భారత్, సౌదీ అరేబియా మధ్య జూలై 31 వరకు 37 ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్టు స్పైస్జెట్ గురువారం తెలిపింది.శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమానాలు జూన్ 5-20 మధ్య మదీనాకు బయలుదేరుతాయని ఎయిర్లైన్ సంస్థ పేర్కొంది. జెద్దా నుంచి శ్రీనగర్కు రిటర్ను ఫ్లైట్లు జూలై 15 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపింది.ఈ ఏడాది హజ్ విమానాలను నడుపుతున్న ఏకైక భారతీయ ఎయిర్లైన్ స్పైస్జెట్ అని సంస్థ పేర్కొంది. స్పైస్జెట్ గతంలో గయా, శ్రీనగర్ నుంచి ప్రత్యేక హజ్ విమానాలను నడిపినట్టు గుర్తు చేసింది. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రత్యేక హజ్ విమాన సేవలు పునఃప్రారంభంకానున్నాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







