భారత్ నుంచి హజ్ యాత్రికుల కోసం ప్రత్యేక విమానాలు
- June 03, 2022
న్యూ ఢిల్లీ: హజ్ యాత్రికుల కోసం భారత్, సౌదీ అరేబియా మధ్య జూలై 31 వరకు 37 ప్రత్యేక విమాన సర్వీసులను నడపనున్నట్టు స్పైస్జెట్ గురువారం తెలిపింది.శ్రీనగర్ నుంచి ప్రత్యేక విమానాలు జూన్ 5-20 మధ్య మదీనాకు బయలుదేరుతాయని ఎయిర్లైన్ సంస్థ పేర్కొంది. జెద్దా నుంచి శ్రీనగర్కు రిటర్ను ఫ్లైట్లు జూలై 15 నుంచి 31 వరకు ఉంటాయని తెలిపింది.ఈ ఏడాది హజ్ విమానాలను నడుపుతున్న ఏకైక భారతీయ ఎయిర్లైన్ స్పైస్జెట్ అని సంస్థ పేర్కొంది. స్పైస్జెట్ గతంలో గయా, శ్రీనగర్ నుంచి ప్రత్యేక హజ్ విమానాలను నడిపినట్టు గుర్తు చేసింది. కొవిడ్ మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రత్యేక హజ్ విమాన సేవలు పునఃప్రారంభంకానున్నాయి.
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







