చర్చి పై ఉగ్రవాదులు దాడి..50 మంది మృతి
- June 06, 2022
నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. ఆదివారం చర్చీలో కాల్పులు, బాంబు పేలుళ్ల సృష్టించారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయి ఉంటారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో చర్చి స్థలం భయానకంగా మారింది.
ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం చర్చీకి వచ్చారు. చర్చి ప్రధాన పాస్టర్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
ఈ ఘటనలో 50 మంది మృతి చెంది ఉంటారని స్థానిక శాసన సభ్యులు టిమిలెయిన్ వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య అధికంగానే ఉండవచ్చని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







