చర్చి పై ఉగ్రవాదులు దాడి..50 మంది మృతి
- June 06, 2022
నైజీరియా: నైజీరియాలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. ఆదివారం చర్చీలో కాల్పులు, బాంబు పేలుళ్ల సృష్టించారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయి ఉంటారని అధికారులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో చర్చి స్థలం భయానకంగా మారింది.
ఒండో రాష్ట్రంలోని సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు ప్రార్థనల కోసం చర్చీకి వచ్చారు. చర్చి ప్రధాన పాస్టర్ ను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.
ఈ ఘటనలో 50 మంది మృతి చెంది ఉంటారని స్థానిక శాసన సభ్యులు టిమిలెయిన్ వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య అధికంగానే ఉండవచ్చని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







