భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవం ఇస్తుంది: ఎంబసీ
- June 06, 2022
కువైట్ సిటీ: మన నాగరికత వారసత్వం, భిన్నత్వంలో ఏకత్వం యొక్క బలమైన సాంస్కృతిక సంప్రదాయాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం అన్ని మతాలకు అత్యున్నత గౌరవాన్ని ఇస్తోందని కువైట్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అంతకు ముందు, ప్రవక్త మొహమ్మద్ (స)ను అవమానించిన వారిపై అధికారికంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వారిపై భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంబసీలో ఫిర్యాదు చేసింది. అలాగే వారిపై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను కువైట్ స్వాగతించింది. అన్ని మతాల పట్ల గౌరవం వ్యక్తం చేస్తూ.. ఇతరుల మతపరమైన వ్యక్తిత్వాన్ని అవమానించడం లేదా ఏదైనా మతం లేదా వర్గాన్ని కించపరచడం వంటి వాటిని ఖండిస్తూ సంబంధిత వర్గాలు ఒక ప్రకటనను కూడా విడుదల చేశాయని ఎంబసీ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







