మహిళలను వేధించే పురుషులకు సంవత్సరం జైలు శిక్ష మరియు Dh10,000 జరిమానా
- June 06, 2022
యూఏఈ: యూఏఈలో రోడ్డు మీద వెళ్తున్న మహిళలను ఉద్దేశపూర్వకంగా మాటలతో గాని చేతలతో గాని వేధింపులకు గురి చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేవారికి భారీగా జరిమానాలు విధించబోతున్నట్లు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వివరించడం జరిగింది.
ఫెడరల్ డిక్రీ చట్టం 2021లోని ఆర్టికల్ 412 ప్రకారం,
1.మహిళలను బహిరంగ ప్రదేశాల్లో ఉద్దేశపూర్వకంగా మాటలతో గాని , చేతలతో గాని వేధింపులకు గురిచేయడం.
2. స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉన్న ప్రదేశాల్లో ఎటువంటి అనుమతి లేకుండా ప్రవేశించే పురుషులను నేరస్తులుగా పరిగణించాలి.
పై రెండు వ్యవహారాలతో సంబంధం ఉన్న వారికి సంవత్సరం జైలు శిక్ష మరియు Dh 10,000 జరిమానా విధించడం జరుగుతుంది.
యూఏఈ యెక్క న్యాయ వ్యవస్థ పట్ల మరియు చట్టాల పట్ల పౌరులకు అవగాహనా కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూషన్ విడుదల చేసిన తాజా సమాచారం.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







