పనిమనిషి రిక్రూట్మెంట్ ఖర్చులపై బహ్రెయిన్ల అసంతృప్తి
- June 08, 2022
బహ్రెయిన్: పనిమనిషి రిక్రూట్మెంట్ ఖర్చులు పెరగడంపై చాలా మంది బహ్రెయిన్ పౌరులు అసంతృప్తిగా ఉన్నారు. హౌస్మెయిడ్ల రిక్రూట్ మెంట్ ఏజెంట్లకు చెల్లించే ఛార్జీలు BD3,000కి పెరగడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్రైపాక్షిక ఒప్పందానికి లేదా గృహిణుల భద్రత, ఆర్థిక భద్రతకు భరోసా ఇచ్చే ఎలాంటి చట్టపరమైన చర్యలకు తాము వ్యతిరేకం కాదని, అయితే రిక్రూట్మెంట్ ప్రక్రియలో పెరుగుతున్న ఖర్చులను అధికారులు అదుపు చేయాలని బహ్రెయిన్ వాసులు కోరుతున్నారు. సాధారణంగా ఏజెన్సీ నుండి పనిమనిషిని నియమించుకునేందుకు అయ్యే ఖర్చులో ఏజెంట్ రుసుము, పనిమనిషిని బహ్రెయిన్కు తీసుకురావడానికి అయ్యే ఖర్చు, వర్క్ పర్మిట్ ఖర్చు ఉంటాయి. మార్కెట్లో గృహ కార్మికులు, హౌస్మెయిడ్ల లభ్యత తక్కువగా ఉండటాన్ని ఏజెంట్లు క్యాష్ చేసుకుంటున్నారని పౌరులు ఆరోపిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







