ఇరాన్లో ఒకే రోజు 12 మంది ఖైదీలకు ఉరి
- June 08, 2022
బలూచి: ఇరాన్లో 12 మంది ఖైదీలను ఒకే రోజు ఉరితీశారు. ఇందులో 11 మంది పురుషులు, ఓ మహిళ ఉన్నారు. డ్రగ్స్, మర్డర్ కేసులో వీళ్లంతా దోషులుగా ఉన్నారు. 12 మందిలో ఆరుగురిపై డ్రగ్ ఆరోపణలు ఉండగా, మరో ఆరుగురిపై మర్డర్ ఆరోపణలు ఉన్నాయి. సిస్తాన్-బలుచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న జహెదాన్ జైలులో సోమవారం ఉదయం వీళ్లను ఉరి తీశారు. ఈ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ బోర్డర్ సమీపంలో ఉంది. 12 మందిని ఉరి తీసిన విషయాన్ని నార్వేకు చెందిన ఇరాన్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. కానీ ఇరాన్కు చెందిన స్థానిక మీడియా ఈ మరణశిక్షపై ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇరాన్లో మైనార్టీ తెగలకు చెందినవారిని టార్గెట్ చేస్తున్నట్లు ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కాగా, 2021లో ఇరాన్లో 333 మంది ఉరి తీశారు.
తాజా వార్తలు
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్







