రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం
- June 10, 2022
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభమైంది.హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే తాజా దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపారు. నిన్న ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలు, దేశ రాజకీయాలపై, పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చర్చించారు.
బీజేపీ యేతర రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్రగతి భవన్ లో జరుగుతున్న తాజా మీటింగ్ లో ఈ అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!