రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం
- June 10, 2022
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభమైంది.హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు.రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే తాజా దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపారు. నిన్న ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలు, దేశ రాజకీయాలపై, పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చర్చించారు.
బీజేపీ యేతర రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్రగతి భవన్ లో జరుగుతున్న తాజా మీటింగ్ లో ఈ అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







