రన్ వే అభివృద్ధి పనులు అద్భుతం: జూన్ 22న పునఃప్రారంభం
- June 11, 2022
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నార్తన్ రన్ వే పనులు సజావుగా సాగుతున్నాయి. జూన్ 22న యధాతథంగా పునఃప్రారంభం జరుగుతుందని అథారిటీస్ పేర్కొనడం జరిగింది. అంతా అనుకున్నట్టే పనులు అవుతున్నాయనీ, పనుల ప్రగతిలో మంచి వేగం కనిపిస్తోందని అథారిటీస్ తెలిపాయి. మే 9 నుంచి ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. 1,000కి పైగా వాహనాలు, 3,000 మంది సిబ్బంది ఈ పనుల్ని రోజులో 24 గంటలూ పని చేస్తున్నారు. ఏవియేషన్ గ్రౌండ్, ఎయిర్ నావిగేషన్ సెన్సార్లు, మిటియరాలాజికల్ ఎక్విప్మెంట్, మెయిన్ కారిడార్ల ప్రవేశం, నిష్క్రమణలు, సీవేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి పనులు జరుగుతున్నాయి. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. 2014లో కూడా ఈ రన్ వే మీద నిర్వహణ పనులు సమర్థవంతంగా నిర్వహించారు. వారానికి సుమారు 1000 విమానాల్ని నిర్వహణ పనుల నిమిత్తం దారి మళ్ళించారు. 45 రోజులపాటు నిర్వహణ పనులు చేశారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు







