జాతీయ పార్టీ ఏర్పాటు సన్నాహాల్లో సీఎం కేసీఆర్
- June 13, 2022
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు త్వరలో జాతీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై నిర్ణయానికి వచ్చిన కేసీఆర్ పార్టీ ఏర్పాట్లను వేగవంతం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గం ఏర్పాటుపై దృష్టి సారించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల మూడో వారంలో ప్రకటన చేయనున్నారు. జూన్ 19న జాతీయ పార్టీ ఏర్పాటుపై టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గంలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే జాతీయ పార్టీకి సంబంధించిన కార్యవర్గం, అధికార ప్రతినిధులు, సమన్వయకర్తలతోపాటు రాష్ట్రాల ప్రతినిధులను కూడా ముందుగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత ఢిల్లీలో ముగ్గురు లేదా నలుగురు అధికార ప్రతినిధులను నియమించనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్యేలతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లతోపాటు కేంద్ర సర్వీసు అధికారులు, కొంత మంది నేతల పేర్లను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. కేసీఆర్ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతుండటంతో పలు రాష్ట్రాలకు చెందిన నేతలు ఆయనను ఫోన్లో సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కొత్త పార్టీ ఏర్పాటు, జాతీయ కార్యవర్గం వంటి అంశాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తో కూడా చర్చలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







