ప్రవాసులకు వీసా మెడికల్ ఫీజు మినహాయింపు!
- June 15, 2022
మస్కట్: ప్రయివేట్ రంగానికి మద్దతు ఇచ్చే ప్రయత్నాలలో ప్రవాస కార్మికులను వైద్య పరీక్షల రుసుము నుండి మినహాయించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ (MoH)కి ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (OCCI) విజ్ఞప్తి చేసింది. కొత్త వీసాల కోసం వైద్య పరీక్ష తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. 2022 నాటి OCCI ధహిరా గవర్నరేట్ బ్రాంచ్ మూడవ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించినట్లు OCCI ధహిరా అధిపతి సైఫ్ బిన్ సైద్ అల్ బాడి చెప్పారు. చిన్న-మధ్యతరహా పరిశ్రమలకు సౌకర్యాలను అందించడానికి OCCI రాయల్ ఆదేశాలకు విలువనిస్తుందన్నారు. ఇది వారి సామర్థ్యాలను, వనరులను మెరుగుపరుస్తుందని, GDPకి వారి సహకారాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుందని ఆయన తెలిపారు. అలాగే గవర్నరేట్లో ప్రైవేట్ రంగ విద్య నాణ్యతను పెంపొందించడానికి - విద్య, నాణ్యత, వృద్ధి - సెమినార్ నిర్వహణను ఆమోదించే తీర్మానాన్ని కూడా సమావేశంలో ఆమోదించినట్లు సైఫ్ బిన్ సైద్ అల్ బాడి తెలిపారు. ప్రవాస కార్మికులందరూ ప్రైవేట్ సెక్టార్ ఆసుపత్రిలో వైద్య పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత MoH RO30 రుసుముతో మెడికల్ సర్టిఫికేట్ను పొందాలి.
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







