వీధి వ్యాపారుల నుంచి 200 కిలోల మాంసం స్వాధీనం

- June 18, 2022 , by Maagulf
వీధి వ్యాపారుల నుంచి 200 కిలోల మాంసం స్వాధీనం

దోహా: వీధి వ్యాపారుల నుంచి మానవ వినియోగానికి పనికిరాని 200 కిలోల మాంసాన్ని మున్సిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అల్ రేయాన్ మున్సిపాలిటీ (అల్ సైలియా సెంట్రల్ మార్కెట్), సెక్యూరిటీ అథారిటీస్ మేనేజ్‌మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఫాలో-అప్‌తో సమన్వయంతో చేపట్టిన ఈ తనఖీల్లో భాగంగా వీధి వ్యాపారుల నుంచి మానవ వినియోగానికి పనికిరాని 270 కిలోల మాంసాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో మంత్రిత్వ శాఖ పేర్కొంది. స్వాధీనం చేసుకున్న మాంసాన్ని ధ్వంసం చేశామని, వీధి వ్యాపారులపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com