చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రచురణ.. Dh2 మిలియన్ల జరిమానా

- June 18, 2022 , by Maagulf
చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రచురణ.. Dh2 మిలియన్ల జరిమానా

యూఏఈ: చట్టవిరుద్ధమైన కంటెంట్ లేదా తప్పుడు డేటాను ప్రచురించిన వారికి జైలు శిక్ష, 2 మిలియన్ దిర్హామ్‌ల వరకు జరిమానా విధించబడుతుందని యూఏఈ  పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. పుకార్లు, సైబర్‌క్రైమ్‌లను ఎదుర్కోవడంపై ఫెడరల్ డిక్రీ-లా నంబర్ 34 2021లోని ఆర్టికల్ 55 ప్రకారం శిక్ష విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన సోషల్ మీడియా ఖాతాలలో ప్రచురించిన అవగాహన వీడియోలో పేర్కొంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా చట్టవిరుద్ధమైన కంటెంట్ ప్రచురించడం చేస్తే Dh2,000,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని అథారిటీ పేర్కొంది. అభ్యంతరకరమైన కంటెంట్‌ని కలిగి ఉన్న ఆన్‌లైన్ ఖాతా లేదా వెబ్‌సైట్ ఆపరేషన్‌ను నిర్వహించే లేదా పర్యవేక్షించే ఏ వ్యక్తికైనా అదే పెనాల్టీ వర్తిస్తుందని వీడియోలో అథారిటీ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com