చిరంజీవి కోసం ఒక్కరు కాదు, ఇద్దిరిద్దరు దర్శకులా.?
- June 18, 2022
‘ఆచార్య’ డిజాస్టర్ తర్వాత చిరంజీవి తన సినిమాల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆయన సినిమాలకు ఒకరు కాదు, ఇద్దరిద్దరు డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు. ఆయన చేతిలో పూర్తి చేయాల్సిన సినిమాలు చాలానే వున్నాయి.
వాటిలో ‘గాడ్ పాదర్’ సినిమా ఓ కొలిక్కి వచ్చేసింది. ఇక మిగిలిన ‘భోళా శంకర్’, ‘వాల్తేర్ వీర్రాజు’ సినిమాల విషయంలో చిరంజీవి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ఆ క్రమంలోనే ‘భోళా శంకర్’ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సలహాలు, సూచనలు తీసుకుంటున్నారని ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతోన్న సమాచారం.
అలాగే ఇప్పుడు ‘వాల్తేర్ వీర్రాజు’ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాకి బాబి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమాకి కొన్ని ఇన్ పుట్స్ ఇస్తున్నారట. అందుకు సాక్ష్యం ఇదే.. అంటూ కొన్ని ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయ్.
‘వాల్తేర్ వీర్రాజు’ షూటింగ్ ప్రస్తుతం హైద్రాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్లో సుకుమార్ పాల్గొన్న ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తున్నాయి. వీటిని చిత్ర యూనిట్టే తమ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం విశేషం.
దాంతో అనుమానాలు నిజమనేంతలా ఫ్యాన్స్లో అంచనాలు పెరిగిపోయాయి. సుక్కు డైరెక్షన్తో బాబీ సినిమాలోని కొన్ని కీలక మార్పులు చేస్తున్నారనీ తెలస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్కి జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. మాస్ రాజా రవితేజ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడనీ సమాచారం.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







