ఆ మాస్ డైరెక్టర్తో సాయి తేజ్ సినిమా నిజమేనా.?
- June 20, 2022
‘ఏమైంది ఈ వేళ’ వంటి కూల్ రొమాంటిక్ సినిమాతో డైరెక్టర్గా పాపులర్ అయిన సంపత్ నంది, తర్వాత వరుసగా మాస్ కంటెంట్ కథలనే సెలెక్ట్ చేసుకుంటూ, మాస్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు.రామ్ చరణ్తో ‘రచ్చ’, మాస్ రాజా రవితేజతో ‘బెంగాల్ టైగర్’ తదితర సినిమాలు తెరకెక్కించి హిట్టు కొట్టిన సంపత్ నందికి ఈ మధ్య పెద్దగా హిట్లు లేవు.
గోపీచంద్తో ‘గౌతమ్ నందా’, ‘సీటీ మార్’ సినిమాలు తెరకెక్కించాడీ మాస్ డైరెక్టర్. కానీ, రెండూ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని, ఓ మంచి కథతో రావాలని వెయిట్ చేస్తున్నాడట. ఆ క్రమంలోనే అనుకున్న స్టోరీ పట్టేశాడట సంపత్ నంది.
ఓ మాంచి యాక్షన్ ఎంటర్టైనర్గా ఆ సినిమాని మలచబోతున్నాడట సంపత్ నంది. అందుకు తగ్గ హీరో కోసం వేట మొదలెట్టాడు. ఆ నేపథ్యంలోనే సాయి ధరమ్ తేజ్, సంపత్ నంది మనసులో మెదిలాడట. వెంటనే సాయి తేజ్కి కథ నెరేట్ చేశాడట సంపత్ నంది.
దాదాపు సాయి తేజ్కి ఈ సినిమా నచ్చిందట. కానీ, అక్కడక్కడా చిన్న చిన్న మార్పులు చేస్తే బావుంటుందన్న సెకండ్ థాట్లో తేజు వున్నాడట.త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వెల్లడి కానున్నాయ్.
కాగా, ‘రిపబ్లిక్’ సినిమా తర్వాత తేజు ఈ మధ్యనే తన కొత్ర ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాడు.కార్తీక్ అనే కొత్త దర్శకుడితో ప్రస్తుతం తేజు ఓ సినిమా చేస్తున్నాడు.యాక్సిడెంట్ కారణంగా కొన్ని నెలలు రెస్ట్లోనే వుండిపోయిన తేజు, మళ్లీ షూటింగ్స్ షురూ చేయడంతో పాటు, కొత్త ప్రాజెక్టుల పైనా కంప్లీట్గా ఫోకస్ పెట్టాడట.ఈ నేపథ్యంలోనే జరుగుతున్న ప్రచారం నిజమై, సంపత్ నంది సినిమాని తేజు లైన్లో పెడతాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







