భారత్ కరోనా అప్డేట్

- June 23, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 13,313 కొత్త కేసులు, 38 మరణాలు నమోదయ్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. ప్రస్తుతం దేశంలో 83,990 ( 0.19 శాతం) యాక్టివ్ కేసులు ఉన్నాయ‌ని వివ‌రించింది. దేశంలో ఇప్పటివరకు 4,33,44,958 కేసులు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది.

అలాగే, ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా వ‌ల్ల‌ 5,24,941 మరణాలు సంభ‌వించాయ‌ని పేర్కొంది. దేశంలో కరోనా రికవరీ రేటు 98.60 శాతంగా ఉంద‌ని తెలిపింది.
నిన్న కరోనా నుంచి 10,972 మంది కోలుకున్నారని చెప్పంది. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం 4,27,36,027 మంది కోలుకున్న‌ట్లు వివ‌రించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com