మినహాయింపు గడువును పొడిగించిన పీఏఎస్ఐ

- June 23, 2022 , by Maagulf
మినహాయింపు గడువును పొడిగించిన పీఏఎస్ఐ

మస్కట్: రిజిస్టర్ చేయడంలో జాప్యం చేయడం.. బీమా చేసిన వారి సేవ ముగిసిన వారికి వచ్చే అదనపు మొత్తాల నుండి మినహాయింపు ఇచ్చే కాలాన్ని పబ్లిక్ అథారిటీ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్(PASI) పొడిగించింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సోషల్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ల బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.యజమానులకు ఆలస్యం కారణంగా వారికి కలిగే అదనపు మొత్తాల నుండి మినహాయింపు ఇచ్చే కాలాన్ని పొడిగించడానికి డైరెక్టర్ల బోర్డు అంగీకరించింది. స్వయం ఉపాధి వ్యవస్థలో నమోదు చేసుకున్న యజమానులు, బీమా పొందిన వ్యక్తులకు సౌకర్యాలను అందించడంతోపాటు విదేశాల్లోని కార్మికుల కోసం ఏర్పడిన వ్యవస్థలకు తాజా నిర్ణయంతో కొంత ఉపశమనం కలుగనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత సంవత్సరం సామాజిక బీమా పెట్టుబడుల నుండి వచ్చే ఆదాయం OMR 300 మిలియన్లను మించిపోయిందని, దీని ఫలితంగా అథారిటీ తన ఆస్తులలో కొంత భాగాన్ని స్థానిక, విదేశీ పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టిందని పబ్లిక్ అథారిటీ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com