పార్క్ చేసిన కారుకు నిప్పంటించిన వ్యక్తి అరెస్ట్
- June 25, 2022
బహ్రెయిన్: రిఫా ప్రాంతంలో పార్క్ చేసిన కారుకు నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. నిప్పంటించిన వాహనం పక్కనే పార్క్ చేసిన మరో మూడు కార్లకు కూడా మంటలు అంటుకొని దగ్ధం అయ్యాయని పోలీసులు తెలిపారు. సమాచారం అందగానే ఘటనాస్థలికి చేరుకున్న సివిల్ డిఫెన్స్ బలగాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నేరస్థలాన్ని సందర్శించి పరిశీలించింది. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని ఇళ్లలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలో.. ఆగివున్న కారు వద్దకు ఓ వ్యక్తి వస్తూ అందులో ఏదో పోసి నిప్పంటించడం కనిపించింది. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







