భారత్ కరోనా అప్డేట్
- June 28, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 11,793కరోనా కేసులు నమోదయినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్తగా వైరస్ కారణంగా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, నిన్నటితో పోలిస్తే తాజా కేసులు కాస్త తగ్గుముఖం పట్టగా.. 24 గంటల్లో 9,486 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్త కేసులతో కలిసి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,34,18,839కు పెరిగింది. 4,27,87,092 మంది కోలుకున్నారు.వైరస్తో 5,25,047 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 96,700 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు 98.57శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.21శాతం ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. సోమవారం దేశవ్యాప్తంగా 4,73,717 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. ఇప్పటి వరకు 86,14,89,40 నమూనాలను పరిశీలించినట్లు చెప్పింది. టీకా డ్రైవ్లో భాగంగా ఇప్పటి వరకు 1,97,31,43,196 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







