ఖతార్ లో కొత్తగా 610 కేసులు నమోదు
- June 28, 2022
దోహా: ఖతార్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 610 కొత్త కమ్యూనిటీ కేసులు నమోదు కాగా.. ఇందులో 58 మంది ప్రయాణికులు ఉన్నారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడు రోజుల్లో తొలి మరణం కూడా నమోదైంది. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 679కి చేరుకుంది. ప్రస్తుతం 4,873 యాక్టివ్ కేసులున్నాయి. ఖతార్లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 380,530కు చేరుకుంది. రోజువారీ సగటు కోలుకున్న కేసుల సంఖ్య 457గా నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం 1,682,286 బూస్టర్ డోసులు అందించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదులు తీసుకున్న వారి సంఖ్య 6,974,984కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 58 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







