ఖతార్ లో కొత్తగా 610 కేసులు నమోదు
- June 28, 2022దోహా: ఖతార్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 610 కొత్త కమ్యూనిటీ కేసులు నమోదు కాగా.. ఇందులో 58 మంది ప్రయాణికులు ఉన్నారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడు రోజుల్లో తొలి మరణం కూడా నమోదైంది. దీంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 679కి చేరుకుంది. ప్రస్తుతం 4,873 యాక్టివ్ కేసులున్నాయి. ఖతార్లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 380,530కు చేరుకుంది. రోజువారీ సగటు కోలుకున్న కేసుల సంఖ్య 457గా నమోదైంది. ఇప్పటి వరకు మొత్తం 1,682,286 బూస్టర్ డోసులు అందించినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు కోవిడ్-19 వ్యాక్సిన్ మోతాదులు తీసుకున్న వారి సంఖ్య 6,974,984కు చేరింది. వివిధ ఆస్పత్రుల్లో 58 మంది కొవిడ్ రోగులు చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు