అవయవదానంలో కువైట్ భారతీయులు ముందున్నారు

- June 28, 2022 , by Maagulf
అవయవదానంలో కువైట్ భారతీయులు ముందున్నారు

కువైట్: అవయవదానం చేయడంలో కువైట్ లో నివసిస్తున్న విదేశీయుల్లో భారతీయ సమూహానికి చెందిన ప్రజలు అందరి కంటే ముందున్నారు అని ప్రముఖ అంత్జాతీయ వైద్య నిపుణులు డాక్టర్ యూసఫ్ బెహ్ బేహని పేర్కొన్నారు. 

కువైట్ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ యూసఫ్ మాట్లాడుతూ అవయవదానం పై ప్రజల్లో మరింత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వంతో కలిసి పనిచేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా అవయవదానం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు బ్రతికున్న వారివి మరియు చనిపోయిన వారివి. ఈ రెండింటి వర్గాల వారికి చెందిన అవయవాలు ద్వారా 8 మందిని బ్రతికించవచ్చు అని పేర్కొన్నారు. 

ఈ సంద్భంగా ఆయన ఇంకో విషయాన్ని గుర్తు చేశారు, కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స ను గల్ఫ్ దేశాల్లో అన్నిటికంటే ముందుగా కువైట్(1979) లో చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com