భారత్ కరోనా అప్డేట్
- July 03, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,103 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 31 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,11,711కాగా, యాక్టివ్ కేసుల శాతం 0.26. పాజిటివిటీ రేటు 4.27 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,35,02,429. కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,199. కరోనా రికవరీ రేటు 98.54 శాతం. కరోనా నుంచి శనివారం 13,929 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు దేశంలో కరోనాతో కోలుకున్న వారి సంఖ్య 4,28,65,519. దేశంలో 197.95 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది.
12-14 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఈ వయసు వారిలో 3.69 కోట్ల మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే, 2.39 కోట్ల మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నారు. 15-18 ఏళ్ల వయసువారిలో 6.05 కోట్ల మంది ఫస్ట్ డోస్, 4.90 కోట్ల మంది సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 4.08 కోట్ల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు.వీరిలో 60 ఏళ్లు దాటిన వృద్ధులతోపాటు, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారు. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ముంబైలోనే 811 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







