కువైట్ లో మళ్లీ ఆ నిబంధన అమలు
- July 03, 2022
కువైట్ సిటీ: కువైట్ మరోసారి ఐసోలేషన్ నిబంధను అమలులోకి తీసుకువచ్చింది.కోవిడ్-19 పాజిటివ్గా తేలిన వారు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.ఇమ్యూన్ యాప్ ద్వారా పాజిటివ్ కేసులను మానిటరింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.ఇంతకు ముందు ఉన్న ష్లోనిక్ యాప్ స్థానంలో ఇమ్యూన్ యాప్ను తీసుకువచ్చినట్లు తెలిపింది.ఇక పై కరోనా పాజిటివ్ తేలిన వారు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు ఐసోలేషన్ ఉండాలని, అలాగే ఆ తర్వాత మరో ఐదురోజులు ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎవరైతే కరోనా బారిన పడతారో వారి ఇమ్యూన్ యాప్ స్టేటస్ ఆటోమెటిక్గా రెడ్గా ఉంటుందని పేర్కొంది.పౌరులు, నివాసితులు ఈ నిబంధనను తప్పకుండా పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!







