కువైట్ లో మళ్లీ ఆ నిబంధన అమలు
- July 03, 2022
కువైట్ సిటీ: కువైట్ మరోసారి ఐసోలేషన్ నిబంధను అమలులోకి తీసుకువచ్చింది.కోవిడ్-19 పాజిటివ్గా తేలిన వారు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది.ఇమ్యూన్ యాప్ ద్వారా పాజిటివ్ కేసులను మానిటరింగ్ చేయనున్నట్లు ప్రకటించింది.ఇంతకు ముందు ఉన్న ష్లోనిక్ యాప్ స్థానంలో ఇమ్యూన్ యాప్ను తీసుకువచ్చినట్లు తెలిపింది.ఇక పై కరోనా పాజిటివ్ తేలిన వారు తప్పనిసరిగా ఐదు రోజుల పాటు ఐసోలేషన్ ఉండాలని, అలాగే ఆ తర్వాత మరో ఐదురోజులు ముఖానికి మాస్క్ ధరించడం తప్పనిసరి అని శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఎవరైతే కరోనా బారిన పడతారో వారి ఇమ్యూన్ యాప్ స్టేటస్ ఆటోమెటిక్గా రెడ్గా ఉంటుందని పేర్కొంది.పౌరులు, నివాసితులు ఈ నిబంధనను తప్పకుండా పాటించాలని సూచించింది.
తాజా వార్తలు
- విశాఖకు సెమీ రింగ్ రోడ్!
- మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్
- ఏసీ టూరిస్ట్ రైల్లో శ్రీ రామాయణ యాత్ర..మార్చి 30న ప్రారంభం..
- BCCI Naman Awards: మిథాలీ రాజ్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా









