వాణిజ్య మోసాలకు పాల్పడిన వారికి జైలు మరియు జరిమానా
- July 06, 2022
దమ్మమ్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ లో వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన మోసాలకు పాల్పడిన 10 మంది విదేశీ కార్మికులకు అక్కడి దమ్మమ్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష మరియు జరిమానా విధించినట్లు తూర్పు ప్రావిన్స్ వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటంచింది.
ఖతిఫ్ గవర్నరేట్ లో ఏటువంటి ప్రభుత్వ గుర్తింపు లైెన్సులను లేకుండా నడుపుతున్న పొగాకు కంపెనీ గత కొన్నాళ్లుగా తన అమ్మకాల్లో పలు వాణిజ్య అవకతవకలకు పాల్పడినట్లు మంత్రిత్వశాఖ ఆరోపించింది. ఈ వ్యవహారంలో కంపెనీ యజమాని కి అక్కడ పనిచేస్తున్న విదేశీ కార్మికులు సహకరించారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు కంపెనీ యజమానికి సంవత్సరం జైలు శిక్ష, అతనికి సహకరించిన 10 మంది భారత్, బంగ్లాదేశ్ చెందిన విదేశీ కార్మికులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే SR 720000 జరిమానా సైతం విధించింది. కంపెనీ పొగాకు ఉత్పత్తులను మరియు కంపెనీ కి సంబంధించిన కీలకమైన ఫైళ్ళను జప్తు చేసేందుకు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సౌదీ అరేబియా వాణిజ్య వ్యతిరేక కార్యకలాపాల చట్టం ప్రకారం ఎవరైతే వాణిజ్య మోసాలకు SR 1 మిలియన్ జరిమానా మరియు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







