తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి
- July 06, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఏరో ఇంజిన్ రిపేర్ సంస్థ సఫ్రాన్ తెలంగాణలోకి అడుగుపెట్టబోతోంది.తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఆ సంస్థ విమానాల మెయింటెనెన్స్ అండ్ రిపేర్ (MRO) యూనిట్ను నెలకొల్పనుంది.హైదరాబాద్లో నెలకొల్పనున్న ఎంఆర్ఓ యూనిట్ ఆ సంస్థ అన్ని యూనిట్లలోకి అతి పెద్దదిగా నిలవనుంది. హైదరాబాద్ యూనిట్ కోసం ఆ కంపెనీ తొలి విడతగా 150 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది.
హైదరాబాద్లో ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సఫ్రాన్కు కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఏరో ఇంజిన్ రిపేర్ రంగంలో భారత్లో ఇప్పటిదాకా ఏ విదేశీ కంపెనీ తన యూనిట్ను ఏర్పాటు చేయలేదన్న కేటీఆర్…హైదరాబాద్లో సఫ్రాన్ ఏర్పాటు చేయనున్న యూనిట్ భారత్లో తొలి విదేశీ కంపెనీ యూనిట్గా రికార్డులకు ఎక్కనుందని తెలిపారు. ఈ యూనిట్ ద్వారా 800 నుంచి 1,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ యూనిట్ ద్వారా ఏరోస్పేస్ రంగంలో హైదరాబాద్కు మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!
- జాతీయ భద్రతపైనే ఫోకస్..అమెరికా-ఇరాన్ చర్చల్లో నో రోల్..!!
- హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదు: సీపీ సజ్జనార్
- కువైట్ ఎయిర్పోట్ ఫ్యుయల్ ట్యాంక్ పై డ్రోన్ దాడి..!!
- IRCTCలో 3 కోట్ల ఫేక్ ఖాతాలు: రైల్వే మంత్రి
- ఒమన్ వ్యాప్తంగా 93 మందికి ఆశ్రయం..!!
- ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
- వరల్డ్ హ్యాపినెస్ రిపోర్టు.. 22వ స్థానంలో సౌదీ అరేబియా..!!
- హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్గా అపజయం ఎరుగని ఎంఎంఏ ఫైటర్









