6 ఏళ్లు పైబడినవారికి మాస్కులు తప్పనిసరి: ఖతార్
- July 07, 2022
దోహా: COVID-19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి కొత్త నివారణ చర్యలకు కట్టుబడి ఉండాలని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH) పిలుపునిచ్చింది. మూసివేసిన ప్రదేశాలతోపాటు అన్ని బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా ఫేస్ మాస్కులు ధరించాలని సూచించింది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయించినట్లు పేర్కొంది. ఆరు సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులందరికీ ఇప్పుడు ఫేస్ మాస్కులు ధరించడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ వివరించింది. ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, కార్యాలయాలు, ప్రజా రవాణా, మస్జీదులు, జిమ్లు, మాల్స్, దుకాణాలు, సినిమాహాళ్లు ఇతర మూసి ఉన్న బహిరంగ ప్రదేశాలలో తప్పనిసరిగా మాస్కులు పెట్టుకోవాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఇటీవల ఖతార్లో రోజువారీ కొత్త COVID-19 కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అర్హులైన వారందరూ బూస్టర్ డోసులను తీసుకోవాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఏదైనా పబ్లిక్ క్లోజ్డ్ ఇండోర్ ఏరియాల్లోకి ప్రవేశించడానికి ముందు Ehteraz అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని గ్రీన్ స్టేటస్ చెక్ చేసుకోవాలని సూచించింది. ఇప్పటివరకు ఖతార్లో 1.7 మిలియన్ల కంటే ఎక్కువ మందికి బూస్టర్ డోస్ను అందించినట్లు.. ఆరు నెలల క్రితం రెండవ డోస్ను తీసుకున్న 12 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు బూస్టర్ డోస్కు అర్హులని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..









