మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో జాక్‌పాట్ కొట్టిన ఇండియన్ టెకీ

- July 07, 2022 , by Maagulf
మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో జాక్‌పాట్ కొట్టిన ఇండియన్ టెకీ

దుబాయ్: మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో భారతీయ ఐటీ ఇంజనీర్ జాక్‌పాట్ కొట్టాడు. దుబాయ్‌లో తాజాగా నిర్వహించిన మహజూజ్ ర్యాఫిల్ డ్రాలో భారత ప్రవాసుడు అనీష్ 10 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.గడిచిన ఏడాది కాలంగా క్రమం తప్పకుండా మహజూజ్‌లో పాల్గొంటున్న అనీష్‌కు తాజాగా అదృష్టం వరించింది.శనివారం(జూలై 2న) దుబాయ్‌లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఏకంగా 10 మిలియన్ దిర్హాములు గెలుచుకున్నాడు.తాజాగా దుబాయ్‌లో మహజూజ్ ప్రధాన కార్యాలయంలో దీని తాలూకు చెక్‌ను ర్యాఫిల్ నిర్వాహకులు అనీష్‌కు అందజేశారు. 

ఈ సందర్భంగా అనీష్ మాట్లాడుతూ..ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం ఆనందంగా ఉందన్నాడు.ఇప్పటికీ తన ఫ్యామిలీ స్వదేశంలోనే ఉందని, వెంటనే వారిని యూఏఈకి తీసుకొచ్చి హ్యాపీగా ఉంటామని చెప్పాడు.ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అలాగే కొనసాగుతానని చెప్పిన అతడు..ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ గురించి ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు.కానీ, తాను గెలిచిన ఈ భారీ నగదుతో తన అప్పులు తీరడంతో పాటు తన పిల్లల భవిష్యత్ కూడా బాగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com