మాజీ ఉద్యోగి వేధింపులపై ఫిర్యాదు
- April 12, 2016
బుడైయాలోని ఓ కెఫెటేరియా ఉద్యోగి, మాజీ ఉద్యోగి వేధింపులను తాళలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను కొడుతున్నాడనీ, హింసిస్తున్నాడనీ ఫిర్యాదులో బాధితుడు మొహమ్మద్ ఫైసల్ పేర్కొన్నారు. బుడైయాలోని కెఫెటేరియాలో పనిచేస్తున్న మొహమ్మద్ ఫైసల్, తనకు చెడ్డ పేరు వచ్చేలా ఆ మాజీ ఉద్యోగి వ్యవహరిస్తున్నాడనీ, అలాగే తన పాస్పోర్ట్ విషయంలోనూ వేధింపులకు గురిచేస్తున్నాడని వెల్లడించాడు. డబ్బు దొంగిలించినట్లుగా ఒప్పుకోవాలని తనపై మాజీ ఉద్యోగి వేధింపులకు దిగాడనీ, స్నేహితులతో కలిసి వచ్చిన అతడు తనను కొట్టాడని, 2000 బహ్రెయినీ దినార్ల కోసం ఇదంతా చేస్తున్నాడని ఫైసల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగం చేయలేక తాను ఉద్యోగం నుంచి బయటకు వచ్చాననీ, ఇండియన్ ఎంబసీ సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేశానని ఫైసల్ వివరించాడు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









